పట్టణాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి : ఎమ్మెల్యే నిమ్మల
ABN , First Publish Date - 2022-06-29T05:36:30+05:30 IST
వైసీపీ పాలనలో పట్టణ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి పోయిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకొల్లు అర్బన్: వైసీపీ పాలనలో పట్టణ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి పోయిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మంగళవారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పర్యటించారు. చిన్నపాటి వర్షం వస్తేనే డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయని, రోడ్లు కాలువలుగా మారిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయ న్నారు. డ్రెయినేజీలు పూడిక తీయకపోయినా రికార్డులు రాసుకుని సొమ్ము చేసుకుంటు న్నారని నిమ్మల ఆరోపించారు. వార్డులో ప్రజలు నిలదీస్తే పూడిక తీస్తున్నార న్నారు. పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతగానో చేసిన అభివృద్ది అంతా వైసీపీ పాలన వచ్చిన మూడేళ్లలో వెనక్కి వెళ్లింద న్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సూచించారు.