నాకు మంత్రి పదవిరాలేదని కార్యకర్తలకు ఆవేదన ఉంది: పార్థసారథి
ABN , First Publish Date - 2022-04-11T18:15:21+05:30 IST
‘‘నాకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తలకు ఆవేదన ఉంది’’ అని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.
విజయవాడ: ‘‘నాకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తలకు ఆవేదన ఉంది’’ అని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి సిద్ధపడితే వారించినట్లు తెలిపారు. తన స్నేహితుడు, ఎంపీ మోపిదేవి వచ్చి ఉదయం కలిశారని... తనకు పదవిరాలేదని అందరికీ బాధగానే ఉందన్నారు. సజ్జల సహా పలువురు నుంచి ఫోన్లు వచ్చాయని, సాధారణంగా మరో పదవి ఇస్తామని చెబుతారని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమి లేదు పార్టీ కోసం పని చేస్తామని పార్థసారథి అన్నారు.
పార్థసారధి అనుచరులు, కార్యకర్తలు మాట్లాడుతూ... సమీకరణాల చూసి తమ నాయకుడికి మంత్రి పదవి రాలేదో అర్థం కావడం లేదన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆ నాయకుడికి ఏం చూసి మంత్రి పదవి ఇచ్చారో తెలియదని తెలిపారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కృష్ణా జిల్లాలో అధిక శాతం పదవులు ఉన్నాయన్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.