ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2022-06-25T05:43:02+05:30 IST

ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి

ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి 


నల్లబెల్లి, జూన్‌ 24: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రుద్రగూ డెం గ్రామంలో ముదిరాజ్‌ కులస్థులు చేపట్టిన పెద్దమ్మతల్లి, పోతురాజుల విగ్రహ పునఃప్రతి ష్ఠాపన వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది పాల్గొని మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌ల కోసం చెరువుల్లో ఉచిత చేపలు, వాహనాలను పంపి ణీ చేసిందన్నారు. బానోతు సారంగపాణి, ఊడుగుల ప్రవీణ్‌గౌడ్‌, చెట్టుపల్లి మురళీధర్‌, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్‌, తావుటిరెడ్డి రాజిరెడ్డి, అబ్బు జైపాల్‌రెడ్డి, నూటెంకి సూరయ్య, ముదిరాజ్‌ కులస్థులు రవి, భరత్‌, నాగరాజు, కమలాకర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

‘రెడ్‌కో’ చైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే 

నర్సంపేట: రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ రెడ్‌కో) చైర్మన్‌గా నియమితులైన సతీష్‌రెడ్డిని హైదరాబాద్‌లోని విశ్వేశ్వరాయ భవన్‌లో శుక్ర వారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కలిసి అభినందించారు. రాష్ట్ర సోషల్‌మీడియా కన్వీనర్‌గా ఉన్న సతీష్‌రెడ్డికి రెడ్‌కో చైర్మన్‌గా సీఎం అవకాశం కల్పించారని ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-25T05:43:02+05:30 IST