ఏడు పాయల ఆలయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం:Raja singh

ABN , First Publish Date - 2022-05-30T00:31:46+05:30 IST

తెలంగాణలో సుప్రసిద్ధమైన దేవాలయం ఏడుపాయల ఆలయం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్(raja singh) అన్నారు

ఏడు పాయల ఆలయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం:Raja singh

మెదక్: తెలంగాణలో సుప్రసిద్ధమైన దేవాలయం ఏడుపాయల ఆలయం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్(raja singh) అన్నారు.ఆదివారం పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గా మాతను(edupayala vana durga maata) రాజాసింగ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయానికి కోట్ల రూపాయలు లతో అభివృద్ధి  చేస్తున్నామంటూ సీఎం కేసీఆర్(kcr) డప్పు కొడుతున్నారని,కానీ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు.


దేవాదాయశాఖ మంత్రి దున్నపోతులాగా కార్యాలయంలో పడుకోవడం కాదు, ఏడుపాయల వచ్చి చూస్తే భక్తుల బాధ తెలుస్తుందని అన్నారు.ఏడుపాయల దేవాలయ కమిటీ లో ముస్లిం, క్రిస్టియన్ లకు అవకాశం ఇవ్వద్దని రాజాసింగ్ పేర్కొన్నారు. ఒక వేళ ఇస్తే ఎలా తొలగించాలన్నవిషయం మాకు తెలుసు అని అన్నారు. 

Updated Date - 2022-05-30T00:31:46+05:30 IST