తెలంగాణలో ఇంటింటికి వ్యాక్సిన్ ప్రారంభించాలి: రాజాసింగ్

ABN , First Publish Date - 2021-06-13T19:06:53+05:30 IST

వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్ ప్రారంభించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

తెలంగాణలో ఇంటింటికి వ్యాక్సిన్ ప్రారంభించాలి: రాజాసింగ్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొంత మందికే వ్యాక్సిన్ ఇస్తుందని, వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్ ప్రారంభించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఇంటింటికి వ్యాక్సిన్ వేస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటింటికి వ్యాక్సిన్ ప్రారంభించాలన్నారు. కేంద్రం అందరికీ సరిపోయే వ్యాక్సిన్ అందుబాటులో ఉంచిందన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యం కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు కేంద్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తగిన సిబ్బందిని నియమించి వ్యాక్సిన్  ప్రతి వ్యక్తికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-06-13T19:06:53+05:30 IST