రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

ABN , First Publish Date - 2021-07-28T05:42:15+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని స్థానిక శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు. జర్మనీ నుంచి తిరిగివచ్చిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆయనను ఆశీర్వదించారు.

రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు
ఎమ్మెల్యే రమేశ్‌బాబును సన్మానిస్తున్న ఆలయ ఉద్యోగులు

 వేములవాడ, జూలై 27 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామిని స్థానిక శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు. జర్మనీ నుంచి తిరిగివచ్చిన సందర్భంగా  స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆయనను ఆశీర్వదించారు.  ఆలయ ఏఈవో బి.శ్రీనివాస్‌ ప్రసాదం అందజేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ఎమ్మెల్యేను సన్మానించిన ఆలయ ఉద్యోగులు

వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బాబును ఆలయ ఉద్యోగులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆలయ ఉద్యోగులకు 61 సంవత్సరాల వయో పరిమితి అమలుకు కృషి చేయడంతోపాటు ఆలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌, కార్యదర్శి పెరుక శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, ఏఈవో నవీన్‌, సూపరింటెండెంట్లు నటరాజ్‌, గోలి శ్రీనివాస్‌, బి.తిరుపతిరావు, అల్లి శంకర్‌ తదితరులు ఉన్నారు.  

Updated Date - 2021-07-28T05:42:15+05:30 IST