కరోనాకు ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదు?: సీతక్క
ABN , First Publish Date - 2021-05-11T17:15:00+05:30 IST
కరోనా మహమ్మారితో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
హైదరాబాద్: కరోనా మహమ్మారితో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా చితికి పోతున్నాయని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కరోనాకు ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. మనం సంపాదించే ప్రతీ వంద రూపాయల్లో 10 నుంచి 20 రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నామన్నారు. కరోనాకు ఉచిత వైద్యం అందించే వరకు ప్రజలు పోరాటం చేయాలని సీతక్క పిలుపు ఇచ్చారు.