టీఆర్ఎస్ కార్యాలయంగా అసెంబ్లీ: Seethakka
ABN , First Publish Date - 2022-03-07T19:25:42+05:30 IST
తెలంగాణ అసెంబ్లీని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్పీకర్లు బండ్రోతులా మారుతున్నరా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా స్పీకర్లు ఇలా ప్రవర్తించ లేదని తెలిపారు. స్పీకర్కు ప్రతిపక్షాల మీద చిన్నచూపు ఉందని వ్యాఖ్యానించారు. మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే గమ్మున కూర్చుందని... పాయింట్ ఆర్డర్ లేవనెత్తి తే కూడా తమ మొహం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు జరిగిన అవమానంపై పోరాటం చేస్తామన్నారు. ‘‘మా గొంతు నొక్కడం అంటే మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే’’ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.