ఆ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు జంకుతుంది: MLA Swamy

ABN , First Publish Date - 2022-05-03T23:47:27+05:30 IST

రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని కలిసేందుకు TDP leadersని అనుమతించకుండా YCP government ఎందుకు జంకుతుందో అర్థం కావడం లేదని TDP MLA Swamy అన్నారు.

ఆ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు జంకుతుంది:  MLA Swamy

ప్రకాశం: రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఆస్పత్రిలో కలిసేందుకు టీడీపీ నేతలని అనుమతించకుండా వైసీపీ ప్రభుత్వం  ఎందుకు జంకుతుందో అర్థం కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని బాలవీరాంజనేయస్వామి , ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబు మంగళవారం  పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మీడియాతో మాట్లాడుతూ.. వైద్యం బాగానే అందుతుందని బాధితురాలు చెప్పిందన్నారు. ప్రభుత్వం వెంటనే బాధితురాలికి 10 లక్షలు ఆర్థిక సాయం, ఐదు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరిగిన దాడులు, అత్యాచారాలపై నిందితులు ఎవరున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయాలని డిమాండ్ చేశారు. టీడీపీ తరపున బాధితురాలికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు  పంపిన రెండు లక్షల చెక్కును బాధితురాలికి టీడీపీ నాయకులు అందజేశారు.

Read more