Andhra news: తెంపల్లిలో ఎమ్మెల్యే వంశీ అనుచరులను నిలదీసిన స్థానికులు
ABN , First Publish Date - 2022-07-20T19:49:11+05:30 IST
తెంపల్లిలో ఎమ్మెల్యే వంశీ అనుచరులను స్థానికులు నిలదీశారు.
కృష్ణా: తెంపల్లిలో ఎమ్మెల్యే వంశీ అనుచరులను స్థానికులు నిలదీశారు. డయేరియాతో అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిరోజులుగా అవస్థలు పడుతున్నా పరామర్శించలేదని వంశీపై మండిపడ్డారు. కలెక్టర్, మండల అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప పరిష్కారం జరగటం లేదని తెంపల్లి వాసులు చెబుతున్నారు. తమకు న్యాయం జరగాలంటూ అధికారులను స్థానికులు నిలదీశారు.