AP News: విశాఖను గంజాయికి, డ్రగ్స్ రాజధానిగా చేశారు: ఎమ్మెల్యే వెలగపూడి

ABN , First Publish Date - 2022-09-26T21:20:17+05:30 IST

విశాఖను చిన్న జిల్లాగా సీఎం జగన్ మార్చారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విమర్శించారు.

AP News: విశాఖను గంజాయికి, డ్రగ్స్ రాజధానిగా చేశారు: ఎమ్మెల్యే వెలగపూడి

విశాఖ (Visakha): పరిపాలన రాజధాని చేస్తామని.. విశాఖను చిన్న జిల్లాగా సీఎం జగన్ (CM Jagan) మార్చారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు (Velagapudi Ramakrishna Babu) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశాఖను గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా చేశారని, ఋషికొండను నాశనం చేశారని మండిపడ్డారు. విశాఖలో చాలా వరకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టేసారని ఆరోపించారు. మరికొన్ని ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. విశాఖలో కొన్ని వందల ఎకరాల భూమి విజయసాయి రెడ్డి (Vijayasai reddy) ఆధ్వర్యంలో కబ్జా జరిగిందని ఆరోపించారు. మాట తప్పం.. మడమ తిప్పం అంటారు.. మడమని దెయ్యాలు మాత్రమే తిప్పుతాయన్నారు. నిన్న జరిగింది వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం కాదని.. సున్నా టేబుల్ సమావేశమని రామకృష్ణ బాబు ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-09-26T21:20:17+05:30 IST