రైతులను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2020-11-30T04:14:59+05:30 IST
నివర్ తుఫాన్తో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నా రాంబా బు అన్నారు.
ఎమ్మెల్యే అన్నా రాంబాబు
వర్షాలకు దెబ్బత్ని పంటల పరిశీలన
బేస్తవారపేట, నవంబరు 29: నివర్ తుఫాన్తో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నా రాంబా బు అన్నారు. ఆదివారం మండలంలోని కోనపల్లె, శింగరపల్లె, శింగసాని పల్లె, గలిజేరుగుళ్ల, పిటికాయగుళ్ల గ్రామాలను సందర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న కంది, మిరప, మొక్కజొన్న, రాగుల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలో పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రైతులను అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. నష్టపోయిన పంటల వివరాలను అధికారులు వెంటనే నమోదు చేయాలన్నారు. కోనపల్లె చెరువుకు నీరు రావడంతో ఎమ్మెల్యే జలహారతి ఇచ్చారు. పిటికాయగుళ్ళ చెరువు అలుగును పరిశీలించి, గ్రామంలోకి నీరు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డి.బాలాజినాయక్, వ్యవసాయాధికారి జె.మెర్సీ, ఎంపీడీవో చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.