ట్రూనాట్‌ కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-11T04:50:19+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి లో సోమవారం ట్రూనాట్‌ కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు.

ట్రూనాట్‌ కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైల్వేకోడూరు, మే 10: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి లో సోమవారం ట్రూనాట్‌ కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ట్రూనా ట్‌ కేంద్రంలో పరీక్షలు చేయించుకున్న వారికి రెండు గంట ల్లో నిర్ధారణ ఫలితాలు వస్తాయన్నారు. రైల్వేకోడూరులో కొవిడ్‌ సేవలు అందిస్తున్న కొవిడ్‌ కేర్‌ కేంద్రం సీహెచ్‌సీ ట్రూనాట్‌ పరీక్ష కేంద్రాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T04:50:19+05:30 IST