మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-01-24T04:42:01+05:30 IST

మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలి : ఎమ్మెల్యే

మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలి : ఎమ్మెల్యే
ఎంపీడీవోను సన్మానిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

నర్మెట, జనవరి 23: రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. నర్మెట, హన్మంతాపూర్‌ గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను శనివారం పరిశీలించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఎంపీడీవో ఖాజామొయినొద్దీన్‌, ఏపీవో రమాదేవిని శాలువాలతో సత్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, ఎమ్డీ.గౌస్‌, శశిరథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T04:42:01+05:30 IST