గుంటూరును అవినీతి రహితంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-12-02T05:50:30+05:30 IST

గుంటూరు నగరాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సూచించారు.

గుంటూరును అవినీతి రహితంగా తీర్చిదిద్దాలి
సమావేశంలో ప్రసంగిస్తున ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వేదికపైన మేయర్‌, ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు1: గుంటూరు నగరాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సూచించారు. బుధవారం కార్పొరేషన్‌లోని కౌన్సిల్‌హాల్‌లో పారిశుధ్యంపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశానికి మేయర్‌ కావటి మనోహర్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అప్పిరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ గుంటూరు ఎంత ముఖ్యమో అవినీతి రహిత పాలన అంతే ముఖ్యమన్నారు. ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్ధాళి గిరి, డిప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు, కమిషనర్‌ చల్లా అనురాధ, సీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి, ఎస్‌ఎస్‌లు రాంబాబు, ఆనందకుమార్‌, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T05:50:30+05:30 IST