అరాచక పాలనకు చరమగీతం పాడుదాం
ABN , First Publish Date - 2021-03-01T06:15:47+05:30 IST
అరాచక పాలనకు చరమగీతం పాడుదాం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్
ములుగుటౌన్, ఫిబ్రవరి 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనకు చరమగీతం పాడుదామని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల కాం గ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సభావత్ రాములు నాయక్ అన్నారు. ములుగులోని డీఎల్ఆర్ గార్డెన్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అధ్యక్షత న ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిఽధి ఇంద్రశోభన్, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ ఆత్మగౌరవం, నీళ్ళు, నిఽధులు, నియామకాల సాధన కోసం కొనసాగిన తెలంగాణ పోరాటం కుటుంబ స్వార్థ రాజకీయాలకు పునాదిగా మా రిందన్నారు. వేలాది మంది నిరుద్యోగుల ఆత్మబలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు గడీల పాలనలో బంధీ అయ్యిందన్నారు. ఒక గిరజన కుటుంబంలో పుట్టి ఎన్నో పోరాటాలు చేసిన, ఎమ్మెల్సీగా ఎదిగిన తాను కేసీఆర్ ఒంటెద్దు పోకడను భరించలేక లేకపోయానన్నారు. నిరంకుశుత్వాన్ని వి భేదించడం వల్లే సస్పెన్షన్కు గురయ్యానన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి గా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల గొం తుకనవుతానన్నారు. సీతక్క మాట్లాడుతూ రైళ్లలో చాయ్ అమ్మానని చెప్పిన మోదీ ప్రధాని అయిన తర్వాత అదే రైళ్లను ప్రైవేటుపరం చేస్తున్నారని వ్యా ఖ్యానించారు. ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు పారిశ్రామిక వేత్తలు కలి సి దేశాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు ప్రైవేట్ టీచర్లకు ఫీల్డు అసిస్టెంట్లకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.