ప్రొటోకాల్‌ పాటించరా?

ABN , First Publish Date - 2021-01-17T05:03:41+05:30 IST

అధికారిక కార్యక్రమాల్లో గురజాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విషయంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదు.

ప్రొటోకాల్‌ పాటించరా?
మాచవరం వైద్యాధికారులను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

వైద్యాధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్సీ జంగా

పిడుగురాళ్ల, జనవరి 16: అధికారిక కార్యక్రమాల్లో గురజాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విషయంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదు. శనివారం కరోనా వ్యాక్సిన్‌ ప్రారంభ కార్యక్రమంలో జంగాకు మరోసారి అవమానం ఎదురైంది. టీకా ప్రారంభం కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం పంపకపోవటంతో నేరుగా మాచవరం వైద్యాధికారులనే ఎమ్మెల్సీ జంగా ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ పాటించని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జంగా వెల్లడించారు.  గత కొంతకాలంగా అధికారుల తీరుపై ఎమ్మెల్సీ జంగా గుర్రుగా ఉంటూ శనివారం మనసులోని బాధను మాచవరంలో వెలిబుచ్చారు.

Updated Date - 2021-01-17T05:03:41+05:30 IST