కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జీవన్రెడ్డి
ABN , First Publish Date - 2021-04-23T09:30:44+05:30 IST
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటిదాకా కరోనా రోగులు వైద్యం కోసం చేసిన ఖర్చును వందశాతం
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటిదాకా కరోనా రోగులు వైద్యం కోసం చేసిన ఖర్చును వందశాతం రీయింబర్స్ చేయాలన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన విద్య, వైద్య హక్కులను కాపాడటంలో విఫలం అయ్యారన్నారు. కేసీఆర్ సాగర్ ఎన్నికల సభతో వేలాదిమందికి కరోనా సోకిందని, దీనికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. కరోనాపై మెడికల్ డైరెక్టర్ ఒకరకంగా, ఈటల మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు.