రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-25T23:39:39+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలభిస్తున్నా..

రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: జీవన్‌రెడ్డి

కరీంనగర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలని ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణతో సర్కార్ నష్టపోతుందని మంత్రి అంటున్నారు..మంత్రి ఏమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు. సాగు చెయ్యని భూములకు కనీసం 15 వేలు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం అవుతుందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-25T23:39:39+05:30 IST