థర్డ్ ఫ్రంట్, ఏ ఫ్రంట్ అవసరం లేదు: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-02-17T22:14:41+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన

థర్డ్ ఫ్రంట్, ఏ ఫ్రంట్ అవసరం లేదు: ఎమ్మెల్సీ కవిత

తిరుపతి: తెలంగాణ సీఎం కేసీఆర్ కూతరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి థర్డ్ ఫ్రంట్, ఏ ఫ్రంట్ అవసరం లేదన్నారు. ఈ రోజు శ్రీవారిని కవిత దంపతులు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోనూ టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందన్నారు. తెలంగాణలో 105 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని బీజేపీ టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తుందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయిందని కవిత అన్నారు. 


ప్రధాని మోడీపై టీఎస్ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దేశానికి మోడీ ఏమీ చేయడం లేదన్నారు. మోడీ అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ముక్త్ భారత్ సాధించే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కొత్త కూటమిని తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. సీఎంలు మమత, స్టాలిన్, ఉద్దవ్, విజయన్ తదితర నేతలతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ సందర్భంగా కేసీఆర్ కూతురు కవిత తిరుమలలో మాట్లాడుతూ దేశానికి థర్డ్ ఫ్రంట్, ఏ ఫ్రంట్ అవసరం లేదనడం గమన్హారం.




Updated Date - 2022-02-17T22:14:41+05:30 IST