అన్ని కులాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్షం: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2021-01-25T00:33:06+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి,కుల్లె కడిగి,చిట్టెపు కులాల రాష్ట్ర స్థాయి ఆత్మీయ స

అన్ని కులాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్షం: ఎమ్మెల్సీ కవిత

జుక్కల్: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి,కుల్లె కడిగి,చిట్టెపు కులాల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం,  కృతజ్ఞత సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొందని అన్నారు. 


కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కేవలం కొద్ద సంవత్సరాలల్లోనే కట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారిదేనని, వరి పంట విషయంలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ తో పోటీ పడుతోందని తెలిపారు. కుల్లగడగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టెపు శివసాయి పటేల్ తెలంగాణ ఉద్యమ కాలం నుండి సీఎం కేసీఆర్ వెంట నడిచారని, ప్రత్యేక రాష్ట్రంలో, బీసీ కమిషన్ అధ్యయనం తరువాత చిట్టెపు కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీసీల్లో చేర్చిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.


ఎమ్మెల్యే హన్మంత్ షిండే పట్టుదల కారణంగానే పిట్లం మండలానికి సీఎం కేసీఆర్ గారు ‘నాగమడుగు’ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎమ్మెల్యే కోరిన మిగతా మూడు సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ‌జుక్కల్ అభివృద్ధిలో వంద శాతం తన పాత్ర ఉంటుందని కవిత ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలను ప్రత్యేక రాష్ట్రంలో అనతికాలంలోనే పరిష్కరించామన్న ఎమ్మెల్సీ కవిత, ఎన్నికల్లో లబ్ధి కోసం కాకుండా, ముందు తరాల వారికి ఉపయోగిపడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.



అంతేకాదు చిన్న రాష్ట్రం అయినా తెలంగాణ అనేక అంశాల్లో‌ నెం.1 గా నిలిచిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కుల్లగడగి కులస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T00:33:06+05:30 IST