వారసత్వ పాలనకు బుద్ధి చెప్పాలి
ABN , First Publish Date - 2021-03-02T05:13:22+05:30 IST
వారసత్వ పాలనకు బుద్ధి చెప్పాలి
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
తొర్రూరు, మార్చి 1 : రాష్ట్రంలో వారసత్వ పాలన కొనసాగుతుందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో వాకర్స్తో కలిసి మాట్లాడి ఓటును అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఆరేళ్ల పాలనలో ఏఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మండలిలో నిరుద్యోగ సమస్యలపై ఏఒక్కరోజు మాట్లాడలేదని, ఆయన పెద్ద కలెక్షన్ కింగ్ అని విమర్శించారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్ రావు, నాయకులు నెమరుగొమ్ముల వెంగళ్రావు, పాపారావు, పెదగాని సోమయ్య, కర్ర శ్రీనివాసరెడ్డి, పల్లె కుమార్, శ్రీమాన్, రాంమోహన్రెడ్డి, రంగు రాములు, శంకర్, మహేందర్, వెంకన్న, నవీన్, శేఖర్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.