మంత్రి నిరంజన్ వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్సీ రామచంద్రరావు

ABN , First Publish Date - 2021-03-04T16:50:02+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మంత్రి నిరంజన్ వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్సీ రామచంద్రరావు

మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించేలా మంత్రి నిరంజన్ మాట్లాడటం సరి కాదని... ఉద్యోగులకు మంత్రి వెంటనే క్షమాపణచెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించడం వల్లే అడ్వకేట్లకు రూ.100 కోట్లు విడుదల చేశారని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో జూనియర్ అడ్వకేట్లకు పారితోషికం కోసం కౌన్సిల్‌లో ప్రస్తావించినట్లు చెప్పారు. పీపీలకు సకాలంలో జీతాలు రావటం లేదని విమర్శించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోడ్ ఉన్న సమయంలో రెసిడెన్షియల్ స్కూల్స్‌లో నియామకాలు చేపడుతున్నారని... వెంటనే అలాంటి నియామకాలు నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-03-04T16:50:02+05:30 IST