ఐదేళ్లు మంత్రిగా ఉండి Jawahar ఏం చేశారు :Mlc Sabzi

ABN , First Publish Date - 2022-05-03T23:43:10+05:30 IST

మాజీ మంత్రి జవహర్ సీపీఎస్ రద్దు విషయంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఐదేళ్లు మంత్రిగా ఉండి Jawahar  ఏం చేశారు :Mlc  Sabzi

ఏలూరు: మాజీ మంత్రి జవహర్ Cps రద్దు విషయంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి మీరు ఏం చేశారని  యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి  నిలదీశారు. మంగళవారం షేక్ సాబ్జి  మీడియాతో మాట్లాడుతూ.. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసనమండలిలో అనేక పోరాటాలు చేశామన్నారు.చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్న తమను ప్రోత్సహించాలే కాని విమర్శలు చేయడం తగదన్నారు. ‘మీకు చేతనైతే మీ పార్టీ ద్వారానో వేరే సంఘాల ద్వారా ర్యాలీలు, నిరసనలు చేసి సహకరించండి. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాం’ అని అన్నారు. జగన్ మాటలను నమ్మి ఉద్యోగులంతా గంపగుత్తగా ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పారు. కాని జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వెంటనే తన పదవీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జి  డిమాండ్ చేశారు. 

Read more