సీతక్క సుడిగాలిపర్యటన
ABN , First Publish Date - 2021-05-07T06:19:08+05:30 IST
సీతక్క సుడిగాలిపర్యటన
మంగపేట, మే 6: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మండలంలో గురువారం పర్యటించారు. మల్లూరులో ఇటీవల అనారోగ్యాలు, ప్రమాదాల బారినపడిన మూడు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రాజుపేటలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బండ్ల రవిబాబు కుటుంబాన్ని, పాత భ్రాహ్మణపల్లిలో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు అయ్యోరి యానయ్య, టి.భగువాన్రెడ్డి, నాయకులు, ప్రచార కార్యదర్శి కె.సాంబశివరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం.నరేందర్, సహకార సంఘం డైరెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.