ఫోన్పే ద్వారా మొబైల్ రీచార్జ్లు ప్రియం
ABN , First Publish Date - 2021-10-23T08:11:17+05:30 IST
డిజిటల్ చెల్లింపు సేవల కంపెనీ ఫోన్పే కస్టమర్లకు మొబైల్ రీచార్జ్లు ప్రియమయ్యాయి.
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సేవల కంపెనీ ఫోన్పే కస్టమర్లకు మొబైల్ రీచార్జ్లు ప్రియమయ్యాయి. రూ.50కి మించిన మొబైల్ రీచార్జ్లపై కంపెనీ ప్రాసెసింగ్ రుసుము వసూలు చేస్తోంది. రూ.50 నుంచి రూ.100 విలువైన రీచార్జ్పై రూపాయి, రూ.వందకు పైగా రీచార్జ్పై రూ.2 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ఆధారిత మొబైల్ రీచార్జ్ లావాదేవీలకూ ఈ వడ్డింపు వర్తిస్తుంది.