‘రిమోట్ ఓటింగ్’ పై తర్వలోనే మాక్ ట్రయల్స్ : సునీల్ అరోరా
ABN , First Publish Date - 2021-01-25T18:54:54+05:30 IST
‘రిమోట్ ఓటింగ్’ పై తర్వలోనే మాక్ ట్రయల్స్ను ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు.
న్యూఢిల్లీ : ‘రిమోట్ ఓటింగ్’ పై తర్వలోనే మాక్ ట్రయల్స్ను ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రిమోట్ ఓటింగ్ విషయంలో కాస్త పురోగతి సాధించాం. త్వరలోనే మాక్ ట్రయల్స్ను కూడా ప్రారంభిస్తాం. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ ఓటర్లకు పోస్టల్ బ్యాెట్ సదుపాయాన్ని కల్పించాలన్న ప్రతిపాదన కూడా న్యాయశాఖ ప్రతిపాదనలో ఉంది.’’ అని అరోరా పేర్కొన్నారు.