మోస్తరు వర్షం
ABN , First Publish Date - 2022-08-08T05:39:58+05:30 IST
చేవెళ్ల డివిజన్ పరిధిలో మోస్తరు వర్షం కురిసింది.
చేవెళ్ల / యాచారం, ఆగస్టు 7 : చేవెళ్ల డివిజన్ పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి ఎండ ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ తదితర మండలాల్లో వర్షం పడింది. కురుస్తున్న వర్షంతో పంటలన్ని దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కురిసిన వర్షంతోనే పంటపొలాల్లో నిలిచి వర్షం నీరే బయటకు పోలేదని తెలిపారు.
యాచారంలో భారీ వర్షం
యాచారం మండలకేంద్రంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులుతో కూడిన వర్షం కురవడంతో అరగంటపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మేడిపల్లి, కుర్మిద్ద, నానక్నగర్, గున్గల్, మాల్, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది.