నిరాడంబరంగా బాలాజీ బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-04-24T04:54:58+05:30 IST
చిలుకూరు బాలాజీ దేవాలయ బ్రహ్మో త్సవాలు
మొయినాబాద్ రూరల్: చిలుకూరు బాలాజీ దేవాలయ బ్రహ్మో త్సవాలు నిరాడంబరంగా కొనసాగు తున్నాయి. రెండోరోజు శుక్రవారం గోప వాహనం, సాయంత్రం హను మంత వాహన సేవా కార్యక్రమాన్ని ప్రధాన అర్చకుడు సీఎస్. రంగరాజన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. దేవాలయం వెనుక ఉన్న అద్దాలమండపంలో వేంకటేశ్వర స్వామివారిని హనుమంత వాహనంపై వేచేపు చేసి, వేదపారాయణం, మంగళహారతి నిర్వహించి వాహన ఉత్సవాన్ని పరిసమాప్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సూర్యప్రభ కార్యక్రమంతోపాటు సాయంత్రం స్వామి వారి కల్యాణ వేడుకలను నిర్వహిస్తామని రంగరాజన్ తెలిపారు.