మూలాలు మరువని మోదీ: ఆజాద్
ABN , First Publish Date - 2021-03-01T07:38:47+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ మూలాలు మరువని వ్యక్తి అని, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినా.. తాను చాయ్వాలాను అని గర్వంగా చెప్పుకొంటారని...
జమ్ము, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ మూలాలు మరువని వ్యక్తి అని, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినా.. తాను చాయ్వాలాను అని గర్వంగా చెప్పుకొంటారని అన్నారు. మోదీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. ఆదివారం జమ్ములో ఓ కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడారు. రాజకీయంగా మోదీతో తనకు తీవ్ర విభేదాలున్నా.. ఆయన మాత్రం గర్వంలేని వ్యక్తి అని కొనియాడారు. ఇటీవల ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం ముగిసిన సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు భావోద్వేగ వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్ మరో సీనియర్ నేత రషీద్ అల్వీ.. ఎన్నికల్లో బీజేపీ పనితీరును ప్రశంసించారు. ‘‘కాంగ్రెస్ కూడా ఇదే పద్ధతిలో ముందుకుసాగాలి’’ అని రషీద్ అల్వీ అన్నారు.