KCRకు MODI భయపడుతున్నారు: వంటేరు ప్రతాప్ రెడ్డి
ABN , First Publish Date - 2022-05-11T00:16:05+05:30 IST
KCRకు MODI భయపడుతున్నారు: వంటేరు ప్రతాప్ రెడ్డి
సిద్దిపేట: గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో FDC ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న నిత్య అవసర ధరలకు కారణం కేంద్రమే అని విమర్శించారు. సంపాదన సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తే, ఉన్న సంపదనే కొల్లగొడుతూ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆరోపించారు. వైఫల్యాలను బట్టబయలు చేస్తారనే KCRకు మోదీ భయపడుతున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చెప్పకుండా, తెలంగాణ సర్కారుపై మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా 65 వేల కోట్ల నిధులను నిలుపుదల చేశారని, మోదీ వైఫల్యం వల్ల దేశానికి శ్రీలంక పరిస్థితి వచ్చేట్లుందని జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ హఠావో దేశ్ కో బచావో, ఎప్పుడు లేని విధంగా రూపాయి విలువ పతనమైందని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.