Modi : అభివృద్ధికి అడ్డుగోడలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అభిమతం

ABN , First Publish Date - 2021-08-05T22:18:47+05:30 IST

విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ వ్యవహాంరపై చర్చ జరపాల్సిందేనంటూ

Modi : అభివృద్ధికి అడ్డుగోడలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అభిమతం

న్యూఢిల్లీ :  విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ వ్యవహాంరపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను ప్రతిష్ఠంభింపజేస్తున్న నేపథ్యాన్ని మోదీ తప్పుపట్టారు. దేశ పురోభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తామేమీ ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడం లేదన్నారు. అభివృద్ధికి గోడలు కట్టాలన్నదే విపక్షాల అభిమతమని, వారి చర్యలు దేశ వ్యతిరేక చర్యల లాగే ఉన్నాయని ధ్వజమెత్తారు. భారత్ వేగంగా ముందకు నడుస్తోందని వివరించారు. ఓ వైపు దేశం కోసం క్రీడాకారులు గోల్ మీద గోల్ చేస్తుంటే, మరి కొందరు మాత్రం తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం గోల్ మీద గోల్స్ చేస్తున్నారని మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు.

Updated Date - 2021-08-05T22:18:47+05:30 IST