ప్రజావిశ్వాసం కోల్పోయిన మోదీ సర్కార్‌

ABN , First Publish Date - 2022-06-26T05:54:54+05:30 IST

ప్రజావిశ్వాసం కోల్పోయిన మోదీ సర్కార్‌

ప్రజావిశ్వాసం కోల్పోయిన మోదీ సర్కార్‌
విలేకరులతో మాట్లాడుతున్న పత్యానాయక్‌

ఆమనగల్లు, జూన్‌ 25: దేశంలో మోదీ సర్కార్‌ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని ఆమనగల్లు మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నేనావత్‌ పత్యానాయక్‌ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో శనివారం మండల రైతు సమన్వయ సమితి నిట్ట నారాయణ, టీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చుక్క నిరంజన్‌గౌడ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పత్యనాయక్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రజాభిమానం ముందు స్వార్థ శక్తుల కుట్రలు ఫలించవన్నారు. అన్నదాతలను కంట తడి పెట్టించిన మోడి సర్కార్‌కు పతనం ఆరంభమైందని పత్యానాయక్‌ అన్నారు. ఆమనగల్లు పట్టణ సమీపంలోని పవిత్ర అయ్యప్ప కొండపై బీజేపీ రాజకీయ సమావేశాలు నిర్వహించడం ఏమిటని ఆయన అభ్యంతరం తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం తగదన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎ్‌స్‌ నాయకులు తల్లోజు రామకృష్ణ, సయ్యద్‌ ఖలీల్‌, రమేశ్‌ నాయక్‌, గుత్తి బాలస్వామి, వడ్డె వెంకటేశ్‌, వడ్డెమోని శివకుమార్‌, రవికుమార్‌, నర్సింహ్మ, ముజీద్‌, వంకేశ్వరం భీమయ్య, మల్లేశ్‌ నాయక్‌, అప్రోజ్‌, గణేశ్‌, రైసల్‌, శివకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:54:54+05:30 IST