వడగాలులకు ప్రాణనష్టం జరగొద్దు: మోదీ
ABN , First Publish Date - 2022-05-06T06:07:48+05:30 IST
వడగాలులు, అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రధాని మోదీ సూచించారు
న్యూఢిల్లీ, మే 5: వడగాలులు, అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రధాని మోదీ సూచించారు. మోదీ గురువారం భారత వాతావరణ శాఖ(ఐఎండీ), జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అధికారులతో సమావేశమయ్యార ని పీఎంవో తెలిపింది. దేశంలో ఈ ఏడాది మార్చి-మే మధ్య నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను మోదీకి ఐఎండీ, ఎన్డీఎంఏ అధికారులు వివరించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాలులతో పాటు అగ్ని ప్రమాద బాధితులను కాపాడేందుకు సత్వరమే సిబ్బంది స్పందించాలని మోదీ సూచించారు. వేసవిలో అడవులను రక్షించాలన్నారు. అనంతరం గోధుమలు సహా ఇతర ఆహార ధాన్యాల సరఫరా, నిల్వలు, ఎగుమతులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.