అల్లూరి జయంతికి ప్రధాని రావడం గర్వకారణం: రఘురామ

ABN , First Publish Date - 2022-07-04T19:41:12+05:30 IST

అల్లూరి సీతారామరాజు జయంతికి ప్రధాని మోదీ (Modi) రావడం గర్వకారణమని ఎంపీ రఘురామకృష్ణరాజు

అల్లూరి జయంతికి ప్రధాని రావడం గర్వకారణం: రఘురామ

భీమవరం: అల్లూరి సీతారామరాజు జయంతికి ప్రధాని మోదీ (Modi) రావడం గర్వకారణమని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని వస్తున్నారని కార్యక్రమానికి హాజరవుదామనుకున్నానని, అయితే తనను సభకు వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. విషనాగులే పాలకులవుతారని, ఆనాడు అంబేద్కర్ (Ambedkar) అనుకోలేదని రఘురామ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులుంటాయని తెలిస్తే రాజ్యాంగాన్ని మరోలా రాసేవారని తెలిపారు. ఇలాంటి నాయకులు ఏపీని పాలిస్తుండడం దురదృష్టకరమన్నారు. పర్యటన లిస్టులో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ముందే ప్రొటోకాల్ అంశాలపై లేఖ రాశానని, తన పేరును లిస్టులో ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదన్నారు. కోర్టులు ఆదేశించినా పట్టించుకోకపోతే ఏమనాలి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

Updated Date - 2022-07-04T19:41:12+05:30 IST