మొగులయ్య ప్రజల మనసు గెలిచాడు: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-03-23T00:08:30+05:30 IST

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దర్శనం మొగులయ్య తన పాటల ద్వారా

మొగులయ్య  ప్రజల మనసు గెలిచాడు: బండి సంజయ్‌

ఢిల్లీ: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దర్శనం మొగులయ్య తన పాటల ద్వారా ప్రజల మనసును గెలిచాడని టీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.  పద్మశ్రీ దర్శనం మొగులయ్యను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మొగులయ్యకి వెంకటస్వామి ఫౌండేషన్ నుంచి రూ. లక్ష బహుమతిని వివేక్ ప్రకటించాడు. గతంలో ధనిక వర్గాలు, డబ్బున్నవారికే అవార్డులు దక్కేవన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకూ అవార్డులు దక్కుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-23T00:08:30+05:30 IST