నిశ్చితార్థం జరిగి రెండేళ్లవుతున్నా పెళ్లికి అంగీకరించని NRI వరుడికి దిమ్మతిరిగే షాక్..!

ABN , First Publish Date - 2022-03-15T21:56:35+05:30 IST

నిశ్చితార్థం జరిగి రెండేళ్లవుతున్నా పెళ్లికి ససేమిరా అంటున్న ఓ ఎన్నారై కుటుంబానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. వధువు ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

నిశ్చితార్థం జరిగి రెండేళ్లవుతున్నా పెళ్లికి అంగీకరించని NRI వరుడికి దిమ్మతిరిగే షాక్..!

మోహాలీ: నిశ్చితార్థం జరిగి రెండేళ్లవుతున్నా పెళ్లికి ససేమిరా అంటున్న ఓ ఎన్నారై కుటుంబానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. వధువు ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని మోహాలీ నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలు అమన్‌దీప్ కౌర్ ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు 2018లో దీపాన్షూతో నిశ్చతార్థం జరిగింది. ఈ క్రమంలో కట్నకానుకల కింద వధువు కుటుంబం కొంత మొత్తాన్ని ఇచ్చుకుంది. ఆ తరువాత దీపాన్షూ పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. 


అయితే.. దీపాన్షూ తల్లిదండ్రులు అమన్‌దీప్‌ను తమ బంధువుల ఇళ్లలో జరిగే పలు కార్యక్రమాలకు తీసుకెళ్లడమే కాకుండా వారందరికీ అమన్‌దీప్ తమ కోడలని కూడా పరిచయం చేశారు. అయితే.. 2021 నవంబర్‌లో అకస్మాత్తుగా సిమ్రన్‌జీత్ కౌర్ అనే మహిళ.. బాధితురాలిని కలిసి తనని తాను వరుడి ప్రియురాలిగా పరిచయం చేసుకుంది. అతడితో ఆమె సహజీవనం చేస్తోందని, అమన్‌దీప్‌తో అతడి వివాహం జరగదని చెప్పుకొచ్చింది. దీంతో.. నిర్ఘాంతపోయిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. వరుడు కుటుంబసభ్యులందరూ మోసానికి పాల్పడ్డారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-03-15T21:56:35+05:30 IST