T20 : బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌కు స్థానం

ABN , First Publish Date - 2022-09-30T15:12:02+05:30 IST

టీ20 భారత జట్టులో జస్ర్పీత్ బుమ్రా(Jasprit Bumrah) స్థానంలో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్‌కు స్ఠానం దక్కింది...

T20 : బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌కు స్థానం

న్యూఢిల్లీ: టీ20 భారత జట్టులో జస్ర్పీత్ బుమ్రా(Jasprit Bumrah) స్థానంలో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్‌కు స్ఠానం దక్కింది. దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతున్న మూడు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచుల కోసం పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ (pacer Mohammed Siraj)ను ఎంపిక చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) (Board of Control for Cricket in India)శుక్రవారం నిర్ణయం తీసుకుంది. వెన్నెముక గాయం కారణంగా పేసర్ జస్ర్పీత్ బుమ్రా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడని బీసీసీఐ తెలిపింది. ఈ సిరీస్ నుంచి వైదొలిగిన బుమ్రా వచ్చే వరల్డ్ కప్‌‌లో కూడా ఆడటం అనుమానంగా మారింది. ఇక టీ 20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు నుంచి బుమ్రా వైదొలిగితే స్టాండ్‌బై బౌలర్ల జాబితాలో ఉన్న మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్ లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. 


దక్షిణాఫ్రికా టీ 20 భారత జట్టు:(India squad for South Africa T20) రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్.



Updated Date - 2022-09-30T15:12:02+05:30 IST