పతనమవుతున్న మొక్కజొన్న
ABN , First Publish Date - 2022-05-17T06:11:20+05:30 IST
పతనమవుతున్న మొక్కజొన్న
క్వింటా రూ.2,400 నుంచి రూ.1,850కి డౌన్
తోట్లవల్లూరు, మే 16 : మొక్కజొన్న ధర రోజురోజుకూ పతనమవుతోంది. క్వింటా మొక్కజొన్న రూ.2,400తో మొదలై నేడు రూ.1,850, 1,900 పలుకుతోంది. తోట్లవల్లూరు మండలంలో ఈ ఏడాది 3,670 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. తక్కువ కాల వ్యవధిలో పంట చేతికి వచ్చే మొక్కజొన్న సాగును వేలాదిమంది రైతులు చేపట్టారు. గత ఏడాది మార్క్ఫెడ్ ద్వారా తోట్లవల్లూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఈ ఏడాది ప్రైవేట్ వ్యాపారులకే అవకాశం కల్పించారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు ప్రారంభంలో రికార్డుస్థాయిలో క్వింటాకు రూ.2,400 ధర చెల్లించారు. ఈ ధర లాభ సాటిగా ఉందని రైతులూ సంతోషించారు. తర్వాత ధరను రూ.1,850 వరకు తగ్గించుకుంటూ వచ్చారు.