Review Meeting : ప‌నుల పురోగ‌తిపై ప్ర‌తి నెలా సమీక్షిస్తా : మంత్రి విడ‌ద‌ల ర‌జిని

ABN , First Publish Date - 2022-08-09T00:01:22+05:30 IST

అమరావతి: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని (Vidatala Rajani) సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీ(PHC)ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఊరూరా ఆధునిక వైద్యం అందించేందుకు ఈ క్లినిక్‌లు ఎంతో

Review Meeting : ప‌నుల పురోగ‌తిపై ప్ర‌తి నెలా సమీక్షిస్తా : మంత్రి విడ‌ద‌ల ర‌జిని

అమరావతి: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని (Vidatala Rajani) సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీ(PHC)ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఊరూరా ఆధునిక వైద్యం అందించేందుకు ఈ క్లినిక్‌లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీ(UHC)లు, పీహెచ్‌సీల నిర్మాణానికి రూ.2,532 కోట్లు కేటాయించామని, ఈ ఏడాది చివరి క‌ల్లా నూత‌న భ‌వ‌నాలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ‌డువులోగా భ‌వ‌నాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప‌నుల పురోగ‌తిపై ప్ర‌తి నెలా స‌మీక్ష‌ నిర్వహిస్తామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా భ‌వ‌నాలన్నీ ఒకే రకంగా ఉండాలన్నారు.  

Updated Date - 2022-08-09T00:01:22+05:30 IST