కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-08T20:34:01+05:30 IST
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో..
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ట్వీట్లో తెలియజేశారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకుని, క్వారంటైన్కు వెళ్లాలని కోరారు.
'కొన్ని లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాను. కరోనా పాజిటివ్ అని వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో నన్ను కలుసుకునేందుకు వచ్చిన వారంతా వైద్యపరీక్షలు చేయించుకుని సెల్ఫ్ ఐసొలేషన్కు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా శ్రేయాభిలాషులందరికీ ధన్యవాదములు' అని చౌదరి ట్వీట్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లో ఫీపర్ కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని ఆయన చెప్పారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదని, తనతో ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోన్ చేయవచ్చని కూడా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ఆయన ట్వీట్కు బీహార్లోని ఔరంగాబాద్ బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ స్పందించారు. కైలాష్ చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, రాజస్థాన్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనాకు కూడా శనివారంనాడు జరిగిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటవ్ అని తేలింది.