అగ్ని ప్రమాదంలో తల్లీకూతురు సజీవ దహనం

ABN , First Publish Date - 2022-07-03T09:16:21+05:30 IST

అగ్ని ప్రమాదంలో తల్లీకూతురు సజీవ దహనం

అగ్ని ప్రమాదంలో తల్లీకూతురు సజీవ దహనం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

అల్లవరం, జూలై 2: కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం శివారు ఆకులవారి వీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆకులవారి వీధిలో సాధనాల లింగన్న కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం రాత్రి లింగన్న ఒక గదిలో, అతని భార్య మంగాదేవి (42), కుమార్తె జ్యోతి (22) మరో గదిలో నిద్రించారు. శుక్రవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఇంట్లో మంటలు చెలరేగాయి. లింగన్న ప్రాణాలతో బయటపడగా తల్లీకూతురు సజీవ దహనమయ్యారు. జ్యోతి కొన్ని నెలల క్రితం దైవాలపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి సురే్‌షను పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమెను ఇటీవలే పుట్టింటి వద్ద వదిలివెళ్లిన సురేష్‌ శుక్రవారం రాత్రి వచ్చి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరగడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ సమయంలో ఒక యువకుడు, ఒక మహిళ వెళ్లడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అల్లవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-07-03T09:16:21+05:30 IST