బంజారాహిల్స్లో తల్లీ కుమార్తె అదృశ్యం
ABN , First Publish Date - 2021-05-06T13:07:40+05:30 IST
తల్లీ కుమార్తె అదృశ్యమయ్యారు.
హైదరాబాద్/బంజారాహిల్స్ : తల్లీ కుమార్తె అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-12లో నివాసముంటున్న అబ్దుల్ నసీర్, భార్య అస్మా ప్రవీణ్, కుమార్తె అయిజ ఫాతిమా కలిసి ఉంటున్నారు. ఈ నెల 3న అస్మా ప్రవీణ్ కుమార్తెతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నసీర్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.