Shocking: సమాధి నుంచి వస్తున్న శబ్దాలు విని భయపడ్డ గ్రామస్తులు.. తవ్వి తీసి చూస్తే షాక్..

ABN , First Publish Date - 2022-07-13T22:14:59+05:30 IST

బీహార్‌లోని ఓ గ్రామ శివారు ప్రాంతంలో కొందరు మహిళలు వంట కోసం కట్టెలు సేకరిస్తున్నారు.

Shocking: సమాధి నుంచి వస్తున్న శబ్దాలు విని భయపడ్డ గ్రామస్తులు.. తవ్వి తీసి చూస్తే షాక్..

బీహార్‌లోని ఓ గ్రామ శివారు ప్రాంతంలో కొందరు మహిళలు వంట కోసం కట్టెలు సేకరిస్తున్నారు. పక్కనే ఉన్న స్మశాన వాటిక నుంచి వారికి చిన్న పిల్ల ఏడుపు శబ్దాలు వినిపించాయి. తీరా చూస్తే అక్కడ ఎవరూ లేరు. చివరకు ఒక సమాధి నుంచి ఆ శబ్దాలు రావడం వారు గమనించారు. దెయ్యం అని భయపడి ఊర్లోకి పరుగు తీశారు. గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో అందరూ కలిసి స్మశాన వాటికకు చేరుకున్నారు. శబ్దాలు వస్తున్న సమాధి నుంచి కొంత మట్టి తొలగించారు. లోపల కొన ప్రాణంతో ఉన్న బాలిక కనిపించింది. దీంతో వారు వెంటనే ఆ  విషయాన్ని పోలీసులకు చేరవేశారు.


ఇది కూడా చదవండి..

Viral Video: వరద నీటిలో మునిగిపోతున్నా సెల్ఫీ తీసుకున్న మహిళ.. వైరల్ అవుతున్న పాత వీడియో!


బీహార్‌లోని సారన్ జిల్లాలో మరా నది ఒడ్డున సోమవారం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలికను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ పాప తన వివరాలను పోలీసులకు చెప్పింది. తన పేరు లాలీ అని, తండ్రి పేరు రాజు శర్మ, తల్లి పేరు రేఖా దేవీ అని వెల్లడించింది. అయితే ఊరు పేరు మాత్రం చెప్పలేకపోయింది. తన అమ్మ, నానమ్మ తనను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి, నోట్లో మట్టిని నింపి, ఇక్కడ పూడ్చిపెట్టినట్లు చెప్పింది. దీంతో పోలీసులు షాకయ్యారు. 


ఆడపిల్లను వదిలించుకోవాలనే కారణంతో కన్నతల్లే ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. కన్నతల్లే అలా చేసిందని తెలిసి గ్రామస్తులు షాకయ్యారు. బతికి ఉండగానే ఆ బాలికను పాతిపెట్టిన తల్లిని, నాన్నమ్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు

Updated Date - 2022-07-13T22:14:59+05:30 IST