AP News: పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-19T21:45:25+05:30 IST

పీలేరు: ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా పీలేరు(Peeleru) నియోజకవర్గ పరిధిలోని గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. గుర్రంకొండ మండలం టి

AP News: పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

పీలేరు: ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా పీలేరు(Peeleru) నియోజకవర్గ పరిధిలోని గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. గుర్రంకొండ మండలం టి రాచపల్లి పంచాయతీ పరిధిలోని దిగువబురుజు పల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డి, ఓబులేశ్వరి కుమార్తె లావణ్యను 2016లో పీలేరు మండలం, జాండ్ల పంచాయతీ పరిధిలోని దిగువపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డితో పెళైంది. వీరికి ఇద్దరు పిల్లలు పరమేష్ (4), మౌనిక (2.6) సంతానం. సుబ్రహ్మణ్యం రెడ్డి వృత్తిరీత్యా తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌లో ప్రైవేట్ కంపెనీల ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. మూడు నెలల క్రితం లావణ్య భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. ఈనెల 16న లావణ్య తాత సురేందర్ రెడ్డి కర్మ క్రియలకు సుబ్రహ్మణ్యం రెడ్డి మహబూబాబాద్ నుంచి దిగువ ఓబులవారిపల్లెకు వచ్చాడు. కర్మక్రియల అనంతరం భార్య, పిల్లలను తనతోపాటు తీసుకెళ్లాలని సుబ్రహ్మణ్యంరెడ్డి ప్రయత్నించాడు. లావణ్య భర్తతో వెళ్లడానికి నిరాకరించడంతో కనీసం పిల్లలనైనా తనతో పంపించాలని కోరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం లావణ్య ఇద్దరు పిల్లలను బలవంతంగా వెంటబెట్టుకొని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్ళింది. ఎవరు లేని సమయంలో పిల్లలతో సహా లావణ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాలను బావి నుంచి బయటకి తీసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు తల్లి లావణ్య, పరమేష్ మృతదేహాలను బావి నుంచి బయటకి తెచ్చారు. మౌనిక మృతదేహం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో దిగువ బురుజుపల్లెలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్రంకొండ ఎస్ఐ దినేష్ కుమార్  కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-19T21:45:25+05:30 IST