భర్త.. ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉండాల్సిన ఈ భార్య.. ఇలా చేసిందేంటి.. భర్త బయటకు వెళ్లడం చూసి..

ABN , First Publish Date - 2022-05-06T16:39:38+05:30 IST

ఆమె ముగ్గురు పిల్లల తల్లి.. తన భర్తతో కలిసి కోళ్ల ఫామ్‌లో పని చేస్తుంటుంది.. బుధవారం ఆమె భర్త సరుకుల కోసమని బజారుకు వెళ్లాడు.

భర్త.. ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉండాల్సిన ఈ భార్య.. ఇలా చేసిందేంటి.. భర్త బయటకు వెళ్లడం చూసి..

ఆమె ముగ్గురు పిల్లల తల్లి.. తన భర్తతో కలిసి కోళ్ల ఫామ్‌లో పని చేస్తుంటుంది.. బుధవారం ఆమె భర్త సరుకుల కోసమని బజారుకు వెళ్లాడు.. అతను తిరిగి వచ్చి ఇంటి తలుపు తీసి చూసే సరికి ఘోరం జరిగిపోయింది.. ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.. దీంతో షాకైన భర్త పోలీసులకు సమాచారం అందించాడు.. ఆ మహిళ తన ముగ్గురు పిల్లలకు ఉరితాళ్లు బిగించి, తను కూడా ఉరి బిగించుకున్న దృశ్యాలు ఫామ్‌లో అమర్చిన సీసీటీవీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి. 


రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌ జిల్లా ఖేడి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న ఆర్‌ఎన్‌టీ పౌల్ట్రీ ఫామ్‌లో భూరాలాల్‌, తన భార్య రూపతో కలిసి ఏడేళ్లుగా పని చేస్తున్నాడు. ఆ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి పౌల్ట్రీ ఫామ్‌లో‌నే నివసిస్తున్నారు. బుధవారం రాత్రి పాలు, ఇతర సామాన్లు తెచ్చేందుకు భూరాలాల్ మార్కెట్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి భార్య రూప (28), పెద్ద కూతురు శివాని (7), కొడుకు రితేష్ (6), చిన్న కూతురు కిరణ్ (3) ఉరివేసుకుని ఉన్నారు. షాకైన భూరాలాల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 


ఆ ఫామ్‌లో అమర్చిన సీసీ కెమేరాల్లో రూప తన ముగ్గురు పిల్లలకు ఉరితాళ్లు బిగించి, తను కూడా ఉరి బిగించుకున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. 15 రోజులుగా భూరాలాల్ అతిగా తాగడం ప్రారంభించాడని, అందువల్ల గొడవలు జరుగుతున్నాయని కొద్ది రోజుల క్రితం కూతురు ఫోన్‌లో చెప్పిందని మృతురాలి తండ్రి పోలీసులకు చెప్పాడు. పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Read more