కుమార్తెకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-08T16:26:20+05:30 IST

కోయంత్తూరులో కుమార్తెకు విషమిచ్చి హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కోయంబత్తూరు సమీపం పార్క్‌సిటీలో ధనలక్ష్మి (53) అనే వితంతువు నివసిస్తోంది. ఆమెకు శశి

కుమార్తెకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్య

చెన్నై: కోయంత్తూరులో కుమార్తెకు విషమిచ్చి హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కోయంబత్తూరు సమీపం పార్క్‌సిటీలో ధనలక్ష్మి (53) అనే వితంతువు నివసిస్తోంది. ఆమెకు శశి కుమార్‌ అనే కుమారుడు, సుకన్య(32) అనే కుమార్తె ఉన్నారు. వీరిలో సుకన్య మానసిక వ్యాధితో బాధపడుతోంది. శశికుమార్‌ శరవణంపట్టి లోని ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం శశికుమార్‌కు వివాహం జరుగగా, కొడుకు, కోడలు, కుమార్తె, ధనలక్ష్మి ఒకే ఇంట్లో ఉంటూవచ్చారు. ఇటీవల మనస్పర్థల కారణంగా కొడుకు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శశికుమార్‌ విధు లకు వెళుతూ తల్లికి ఫోన్‌ చేసినా ఆమె ఫోన్‌ తీయలేదు. దీంతో చుట్టుపక్కలివారికి ఫోన్‌ చేసి ఇంటికి వెళ్ళి చూడమన్నాడు. వారు ఆ ఇంటి లోపలకు వెళ్ళి చూడగా ఓ గదిలో ధనలక్ష్మి ఉరేసు కుని వేలాడుతుండటం, సుకన్య నోటిలో నురగతో శవమై పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసు పత్రికి తరలించారు. కుటుంబ సమస్యలకు తోడు, కుమార్తె మానసిక రోగిగా ఉండటాన్ని భరించలేక ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని, అదే సమయంలో కుమార్తెకు విషమిచ్చి హత్య చేసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తుడియ లూరు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2022-01-08T16:26:20+05:30 IST