విద్యుత్‌ షాక్‌తో తల్లి మృతి

ABN , First Publish Date - 2021-04-24T04:56:39+05:30 IST

తల్లి కరెంటు షాక్‌తో మృతి చెందడం, తండ్రి జాడే లేకపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిన సంఘటన రాజంపేటలో చోటుచేసు కుంది.

విద్యుత్‌ షాక్‌తో తల్లి మృతి

జాడే లేని తండ్రి అనాథలైన పిల్లలు

రాజంపేట టౌన్‌, ఏప్రిల్‌23 : తల్లి కరెంటు షాక్‌తో మృతి చెందడం, తండ్రి జాడే లేకపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిన సంఘటన రాజంపేటలో చోటుచేసు కుంది. ఈ దుర్ఘటనలో శోభ(35) అనే మహిళ దుర్మరణం చెందింది. రాజంపేట పట్టణ సీఐ చంద్రశేఖర్‌ వివరాల మేరకు... 

పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపం ఎస్‌.వి.నగర్‌ వద్ద ఉన్న యూనియన్‌ బ్యాంకు సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న శోభ భవనంపై బట్టలు ఆరవేయడానికి వెళ్లింది. ప్రమాదవశాత్తూ 11కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త ఏడాది కిందట వదిలివేసి వెళ్లిపోవడంతో శోభ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ ఉండేది. తమకు ఆసరాగా ఉన్న తల్లి కూడా విద్యుత్‌షాక్‌తో మృతిచెందడంతో ఆమె పిల్లలు కూతురు పూజ, కొడుకు విటల్‌ అనాథలుగా మిగిలారు. తల్లి మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. చూపరులను కంటతడి పెట్టిం చాయి. విషయం తెలిసిన వెంటనే పట్టణ సీఐ చంద్రశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆ పిల్లలను ఏదైనా సంరక్షణా కేంద్రంలో చేర్చడానికి ఉన్నతాధికారులతో మాట్లాడారు. 

Updated Date - 2021-04-24T04:56:39+05:30 IST