Heart wrenching incident: కూతుళ్లను నదిలో పారేసి.. హాయిగా నిద్రపోయిన తల్లి.. పిల్లల కోసం అంతా వెతుకుతోంటే..

ABN , First Publish Date - 2022-07-23T23:38:27+05:30 IST

ఆ మహిళ బుధవారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నిద్రపోయింది..

Heart wrenching incident: కూతుళ్లను నదిలో పారేసి.. హాయిగా నిద్రపోయిన తల్లి.. పిల్లల కోసం అంతా వెతుకుతోంటే..

ఆ మహిళ బుధవారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నిద్రపోయింది.. అర్ధరాత్రి సమయంలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని నది దగ్గరకు వెళ్లింది.. ఇద్దరినీ నదిలోకి తోసేసింది.. కొద్ది సేపటి తర్వాత ఆమె ఒక్కతే ఇంటికి వచ్చి నిద్రపోయింది.. తర్వాతి రోజు ఉదయం లేచి చూసేసరికి చిన్న పిల్లలిద్దరూ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండ్రోజుల తర్వాత ఆ చిన్నారుల మృతదేహాలను నదిలో నుంచి వెలికి తీశారు.. ఆ చిన్నారుల తల్లిని విచారించి షాకింగ్ విషయం బయటపెట్టారు. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)) లోని బిలాస్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

14 Year Old Girl Abortion Case: నాకీ గర్భం వద్దు.. తీసేయించుకుంటానన్న 14 ఏళ్ల బాలిక.. హైకోర్టు తీర్పు ఏంటంటే..


బిలాస్‌పూర్‌కు చెందిన గౌతమ్, సావిత్రి దంపతులకు ఆర్వీ నిషాద్ (4), అనిక (2) అనే కుమార్తెలున్నారు. సావిత్రి చాలా రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. బుధవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకుంది. తను చనిపోతే కూతుళ్లను ఎవరూ చూడరనే ఉద్దేశంతో ముందు వారిని చంపాలనుకుంది. కూతుళ్లను తీసుకుని బుధవారం అర్ధరాత్రి నది దగ్గరకు వెళ్లింది. ముందుగా వారిద్దరినీ నదిలోకి తోసేసింది. ఆ తర్వాత ఆమె కూడా నదిలోకి దూకేసింది. అయితే కొద్దిసేపటికి భయపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. నేరుగా ఇంటికి వెళ్లి నిద్రపోయింది. 


తర్వాతి రోజు ఉదయం పిల్లలిద్దరూ కనిపించకపోవడంతో గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో సావిత్రి తను చేసిన పని గురించి చెప్పింది. అయితే సావిత్రి మానసిక రోగి కావడంతో పోలీసులు ఆమె మాటలను నమ్మలేదు. కానీ, నదిలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-23T23:38:27+05:30 IST