పెళ్లయిన 11 ఏళ్లకు ఓ భర్తకు అనుకోని కష్టం.. ఇద్దరు పిల్లలతో సహా నడిరోడ్డు మీద ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-06-08T22:45:08+05:30 IST

అతనికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది.. ముగ్గురు పిల్లలున్నారు.. ఇటీవల భార్య తన మేనమామ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరింది

పెళ్లయిన 11 ఏళ్లకు ఓ భర్తకు అనుకోని కష్టం.. ఇద్దరు పిల్లలతో సహా నడిరోడ్డు మీద ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందంటే..

అతనికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది.. ముగ్గురు పిల్లలున్నారు.. ఇటీవల భార్య తన మేనమామ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరింది.. అక్కడ నుంచి ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.. తన ఇద్దరు పిల్లలను మేనమామ ఇంట్లో వదిలేసి, మూడేళ్ల వయసున్న మూడో బిడ్డను తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది.. దీంతో ఆ భర్త ఇద్దరు పిల్లలను తీసుకుని పోలీసులను ఆశ్రయించాడు.. తన భార్యను, కొడుకును వెతికి పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు.. బీహార్‌లోని సీతామరిలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

పెళ్లయిన మొదటి రాత్రే భార్య పొట్టపై ఆపరేషన్ చేసి కుట్లు వేసిన ఆనవాళ్లను గుర్తించిన భర్త.. ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు తెలిసి..


సీతామరికి చెందిన సంజీవ్ పాశ్వన్, సప్నా దేవి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంజీవ్, సప్నకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తన మేనమామ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి సప్న రెండ్రోజుల క్రితం పిల్లలను తీసుకుని బయల్దేరింది. అక్కణ్నుంచి తన ప్రియుడు మంటూ యాదవ్‌తో కలిసి వెళ్లిపోయింది. పెద్ద కొడుకు ప్రశాంత్‌ను, కూతురు సంధ్యను మేనమామ ఇంట్లో వదిలేసింది. మూడేళ్ల కొడుకును తీసుకుని ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. 


విషయం తెలుసుకున్న సంజీవ్ తన భార్య, కొడుకు కోసం పోలీసులను ఆశ్రయించాడు. తనను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన భార్యను పట్టుకోవాలని అభ్యర్థించాడు. తన భార్యను తీసుకెళ్లిన మంటూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-06-08T22:45:08+05:30 IST